ఎల్బీనగర్ (తెలంగాణ వార్త) శుక్రవారం ఎల్.బి.నగర్ జోన్ పరిధిలో కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్.బి.నగర్ మరియు సరూర్ నగర్ సర్కిల్లో 23 వార్డ్ కార్యాలయాలకు గాను 20 వార్డు కార్యాలయాలను ప్రారంభించడం జరిగింది.
చేవెళ్ళ లోక్సభ సభ్యుడు, శ్రీ. గడ్డం రంజిత్ రెడ్డి గారు మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, సరూర్ నగర్ మరియు రామ కృష్ణ పురం వార్డు కార్యాలయాలను
మేయర్, శ్రీమతి. గద్వాల్ విజయలక్ష్మి గారు, లింగోజిగూడ మరియు రమంతపుర్ వార్డ్ కార్యాలయాలను
యం.ఎల్.ఏ, ఎల్.బి.నగర్, శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, చంపాపేట్ మరియు మన్సూరాబాద్ వార్డ్ కార్యాలయాలను
యం.ఎల్.ఏ, ఉప్పల్, శ్రీ. బేతి సుభాష్ రెడ్డి గారు, నాచారం, హబ్సిగూడ, ఉప్పల్ వార్డ్ కార్యాలయాలను
యం.యల్.సి, శ్రీ. యెగ్గె మల్లేశం గారు, నాగోల్ వార్డు కార్యాలయంను
యం.యల్.సి, శ్రీ. బోగరపు దయానంద్ గారు, కొత్తపేట వార్డు కార్యాలయంను
యం.యల్.సి, శ్రీ. గోరటి వెంకన్న గారు, వనస్థలిపురం వార్డు కార్యాలయంను మరియు ఇతర ప్రదేశాలలో స్థానిక కార్పొరేటర్లు ప్రారంభించడం జరిగింది.
వార్డు కార్యాలయం నుండి పరిపాలన అందిస్తామని మరియు ఆ వార్డు సంబంధించిన అన్ని శాఖల అధికారులు ప్రజా సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉంటారని తెలియచేశారు.
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/06/1000505492-1024x683.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/06/1000505491-1024x683.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/06/1000505490-1024x678.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/06/1000505494-1024x678.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/06/1000505493-1024x678.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/06/1000505489-1024x678.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/06/1000505488-1024x682.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2023/06/1000505487-1024x461.jpg)
Leave a comment