Home జనరల్ I&PR ఆధ్వర్యంలో మరణించిన జర్నలిస్టులకు లక్ష రూపాయల పంపిణీ.
జనరల్

I&PR ఆధ్వర్యంలో మరణించిన జర్నలిస్టులకు లక్ష రూపాయల పంపిణీ.

తెలంగాణ వార్త:: రాష్ట్ర ప్రభుత్వం I&PR మరియు మీడియా అకాడమీ అధ్యర్యంలో మరణించిన 38 జర్నలిస్ట్ కుటుంబలకు లక్ష రూపాయల చొప్పున అలాగే శాస్ర చికిత్స చేయించుకున్న నలుగురు జర్నలిస్టులకు 50వేల చొప్పున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీ వాసిరెడ్డి, పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్, ఐజేయు జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి గార్ల చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు.

ఆదివారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్టు కోటగిరి గంగాధర్ సతీమణి స్వరూప, నిజామాబాద్ నగరానికి చెందిన రామ్మోహన్ చారి సతీమణి మంజుల, ఇద్దరికీ లక్ష రూపాయలు చొప్పున చెక్కులను అందజేశారు. అలాగే శాస్త్ర చికిత్సలు చేయించుకున్న కబురు శ్రీనివాస్, నమస్తే తెలంగాణ డెస్క్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కూతురు (మానస) కు 50,000 చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలకు 3000 చొప్పున పెన్షన్ అలాగే వాళ్ళ పిల్లలు పదవ తరగతి చదువుకునే కొరకు నెలకు 1000 రూపాయలు విద్యాభృతి చెల్లించడం హర్షించదగ్గ విషయం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలతో జర్నలిస్టుల కుటుంబాలతో పాల్గొన్న TUWJ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, జిల్లా కోశాధికారి సిరిగాద ప్రసాద్ ప్రభుత్వానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కి, TUWJ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ కు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్తున్న గురుడు కాపు సంఘం భక్తులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని గురుడుగాపు సంఘం భక్తులు భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జరానికి గణనాథుని నిమజ్జనానికి...

జనరల్

హయత్ నగర్ సర్కిల్ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగురవేసిన హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్…

తెలంగాణ వార్త::తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్, డాక్టర్...

జనరల్

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తెలంగాణ తల్లిని,...

జనరల్

రికార్డింగ్ డ్యాన్సులు, హైడ్రోజల్ బల్బ్స్ తో గణేష్ నిమజ్జనం చేస్తే కఠిన చర్యలు అడిషనల్ డి.సి.పి బసవా రెడ్డి హెచ్చరిక…

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ డివిజన్లో గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా ఆర్మూర్ అడిషనల్ డిసిపి బసవ...

You cannot copy content of this page