Home జనరల్ కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం హేయమైన చర్య… బారాస నేత రవీందర్ యాదవ్…
జనరల్

కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం హేయమైన చర్య… బారాస నేత రవీందర్ యాదవ్…

ఆంధ్రా గుండాలతో అరికెపూడి దాడులకు పాల్పడటం పై ఆగ్రహం

సంస్కార హీనుడు అరికెపూడి గాంధీ

ప్రజాప్రతినిధిగా ఉంటూ మాట్లాడాల్సిన మాటలు అవేనా..?

ప్రజలు అందుకేనా గెలిపించింది..?

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తాట తీస్తాం

బ్రోకర్లు ఎవరో ప్రజలకు తెలుసని స్పష్టం

అరికెపూడికి దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్

కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని ఊసరవెల్లిలా మాటలు మార్చుతున్నారని మండిపాటు

ఎమ్మెల్యే అరికెపూడిపై భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ధ్వజం

తెలంగాణ వార్త:: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ అన్నారు. ఆంధ్రా గూండాలను దాడికి ఉసి గొల్పిన అరికెపూడి గాంధీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. బూతులతో పాడి కౌశిక్ ను తిట్టారని, అదే మాటలు తాము అనలేక కాదని, తమకు సంస్కారం ఉంది అని వెల్లడించారు. అరికెపూడి గాంధీ ఓ సంస్కార హీనుడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవాం కాదా..? అని నిలదీశారు. మగాడిలా రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. భారాసలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్ని సవట పనులు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారాస నేతలను నోటికి ఏది వస్తే అది అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గురువారం రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ మాట్లాడాల్సిన మాటలు అవేనా అని గాంధీని ప్రశ్నించారు. అరికెపూడికి కొంచెం సంస్కారం ప్రసాధించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. శేరిలింగంపల్లి ప్రజలకు ఇప్పుడిప్పుడే నీ బుద్ధి తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ లో చేరిన నువ్వు ప్రతిపక్ష పార్టీపలో ఉన్నట్లు ఎలా అవుతుందని నిలదీశారు. ముందు శేరిలింగంపల్లి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు. భారాసను విమర్శించే అర్హత అరికెపూడి గాంధీకి లేదని రవీందర్ యాదవ్ అన్నారు. గులబీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. బ్రోకర్ లు ఎవరో శేరిలింగంపల్లి ప్రజలకు బాగా తెలుసని వెల్లడించారు. త్వరలోనే తగిన బుద్ధి చెప్పేందుకు భారాస కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని రవీందర్ యాదవ్ అన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్తున్న గురుడు కాపు సంఘం భక్తులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని గురుడుగాపు సంఘం భక్తులు భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జరానికి గణనాథుని నిమజ్జనానికి...

జనరల్

హయత్ నగర్ సర్కిల్ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగురవేసిన హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్…

తెలంగాణ వార్త::తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్, డాక్టర్...

జనరల్

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తెలంగాణ తల్లిని,...

జనరల్

రికార్డింగ్ డ్యాన్సులు, హైడ్రోజల్ బల్బ్స్ తో గణేష్ నిమజ్జనం చేస్తే కఠిన చర్యలు అడిషనల్ డి.సి.పి బసవా రెడ్డి హెచ్చరిక…

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ డివిజన్లో గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా ఆర్మూర్ అడిషనల్ డిసిపి బసవ...

You cannot copy content of this page