Home జనరల్ కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం హేయమైన చర్య… బారాస నేత రవీందర్ యాదవ్…
జనరల్

కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం హేయమైన చర్య… బారాస నేత రవీందర్ యాదవ్…

ఆంధ్రా గుండాలతో అరికెపూడి దాడులకు పాల్పడటం పై ఆగ్రహం

సంస్కార హీనుడు అరికెపూడి గాంధీ

ప్రజాప్రతినిధిగా ఉంటూ మాట్లాడాల్సిన మాటలు అవేనా..?

ప్రజలు అందుకేనా గెలిపించింది..?

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే తాట తీస్తాం

బ్రోకర్లు ఎవరో ప్రజలకు తెలుసని స్పష్టం

అరికెపూడికి దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్

కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని ఊసరవెల్లిలా మాటలు మార్చుతున్నారని మండిపాటు

ఎమ్మెల్యే అరికెపూడిపై భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ధ్వజం

తెలంగాణ వార్త:: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడికి పాల్పడటం హేయమైన చర్య అని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ అన్నారు. ఆంధ్రా గూండాలను దాడికి ఉసి గొల్పిన అరికెపూడి గాంధీ తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. బూతులతో పాడి కౌశిక్ ను తిట్టారని, అదే మాటలు తాము అనలేక కాదని, తమకు సంస్కారం ఉంది అని వెల్లడించారు. అరికెపూడి గాంధీ ఓ సంస్కార హీనుడని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరింది వాస్తవాం కాదా..? అని నిలదీశారు. మగాడిలా రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. భారాసలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్ని సవట పనులు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారాస నేతలను నోటికి ఏది వస్తే అది అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గురువారం రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. ఓ ప్రజాప్రతినిధిగా ఉంటూ మాట్లాడాల్సిన మాటలు అవేనా అని గాంధీని ప్రశ్నించారు. అరికెపూడికి కొంచెం సంస్కారం ప్రసాధించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు. శేరిలింగంపల్లి ప్రజలకు ఇప్పుడిప్పుడే నీ బుద్ధి తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ లో చేరిన నువ్వు ప్రతిపక్ష పార్టీపలో ఉన్నట్లు ఎలా అవుతుందని నిలదీశారు. ముందు శేరిలింగంపల్లి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు. భారాసను విమర్శించే అర్హత అరికెపూడి గాంధీకి లేదని రవీందర్ యాదవ్ అన్నారు. గులబీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. బ్రోకర్ లు ఎవరో శేరిలింగంపల్లి ప్రజలకు బాగా తెలుసని వెల్లడించారు. త్వరలోనే తగిన బుద్ధి చెప్పేందుకు భారాస కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని రవీందర్ యాదవ్ అన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రయాణికులు ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఎస్ హెచ్ ఓ..

తెలంగాణ వార్త. ధోండి మోహన్. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మరియు సిబ్బంది...

జనరల్

అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

హైదరాబాద్ తెలంగాణ బ్యూరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్...

జనరల్

నాయకులు చేస్తే సంసారం? అధికారులు చేస్తే వ్యభిచారమా!ఆర్మూర్ రూటు సపరేటు!ఇది ఎక్కడి న్యాయం..

*తెలంగాణ వార్త* హైదరాబాద్ (సిటీ బ్యూరో) దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్...

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

You cannot copy content of this page