Home జనరల్ అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..
జనరల్

అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

హైదరాబాద్ తెలంగాణ బ్యూరో

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నేడు అంగరంగ వైభవంగా ఆరంభం కాబోతోంది. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రెండు రోజుల ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా ప్రఖ్యాతి చెందిన కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే వివిధ కంపెనీలకు చెందిన 46 మంది ప్రతినిధులు తరలివస్తున్నారు. ఈ మధ్నాహ్నం 1: 30 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. సుమారు రెండు వేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారంభ వేడుకకు హాజరవుతున్నారు.

మరోవంక- రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. అన్ని జిల్లా కేంద్రాల్లో దీనికి సంబంధించిన ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మంగళవారం నాడు వాడవాడలా విజయోత్సవ కార్యక్రమాలు చేపట్టడానికి చురుగ్గా పనులు సాగుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్    తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు...

జనరల్

ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం..

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున ఈనెల 16 నుంచి తెలంగాణ విద్యాశాఖ...

జనరల్

అన్నిచోట్ల కట్టెల పొయిలే దిక్కు!!

తెలంగాణ వార్త:: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఓటర్లు సంక్షోభంలో పడ్డాయి. తమ వద్ద స్టాక్...

జనరల్

గ్యాస్ సిలిండర్లు బ్లాక్ లో అమ్మితే ఈ నంబర్లకు కాల్ చేయండి. స్టీఫెన్ రవీంద్ర..

తెలంగాణ వార్త: హైదరాబాదులో గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్...

You cannot copy content of this page