Home జనరల్ చిన్నాపూర్ అర్బన్ పార్క్ ను సందర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యేలు.
జనరల్

చిన్నాపూర్ అర్బన్ పార్క్ ను సందర్శించిన కలెక్టర్, ఎమ్మెల్యేలు.

తెలంగాణ వార్త: నిజామాబాద్, మార్చి 26 : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో గల మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్ ను శనివారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు సందర్శించారు. 120 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంతో కూడిన రిజర్వు ఫారెస్ట్ ఏరియాలో అరణ్య అర్బన్ పార్క్ పేరుతో నెలకొల్పుతున్న ఈ ఉద్యానవనంలో సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. 5.6 కిలోమీటర్ల నిడివితో కూడిన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చెక్ డ్యాంలు, పర్కులేషన్ ట్యాంక్ లు, వాచ్ టవర్ లు, రెస్ట్ రూమ్ తదితర పనులను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యేలు వాటి గురించి తమ వెంట ఉన్న డీఎఫ్ఓ సునీల్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. నాణ్యతా లోపాలకు తావులేకుండా పనులను పకడ్బందీగా, నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారికి ఆనుకుని సువిశాల విస్తీర్ణంలో కూడుకుని ఉన్నందున సందర్శకులను విశేషంగా ఆకర్షించేలా అన్ని రకాల వసతులు, హంగులను సమకూర్చాలని అన్నారు. ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే వారితో పాటు, ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల ప్రజలకు ప్రకృతి సహజంగా ఉన్న పచ్చదనం ఎంతగానో ఆకట్టుకుంటుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సందర్శకుల సౌకర్యార్థం ప్రత్యేక పైపులైన్ ద్వారా తాగునీటి వసతి ఏర్పాటు చేయిస్తామని అన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులను పూర్తి చేయించి పార్కును ప్రజలకు అందుబాటులోకి తేవాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. కలెక్టర్, ఎమ్మెల్యేలతో పాటు నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు అర్బన్ పార్క్ ను సందర్శించిన వారిలో ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page