Home జనరల్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్మూర్ పర్యటన
జనరల్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్మూర్ పర్యటన

ఆర్మూర్ లో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్.

-పార్థసారథిని ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు.

ఆర్మూర్ తెలంగాణ వార్త క్లాస్ మేట్ అని అడుగుతున్నాడు} మార్చి12 : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి శనివారం ఆర్మూర్ లో పర్యటించారు. హైదరాబాద్ నుండి నేరుగా ఆర్మూర్ కు చేరుకున్న ఆయన ముందుగా స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో జిల్లా అధికారులతో భేటీ అయ్యారు. జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోవింద్, ఆర్డీవో శ్రీనివాస్ తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు స్వాగతం పలికి, ఆయనతో సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కారణాల వల్ల ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఖాళీ అయిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆరా తీశారు. జిల్లాలో మొత్తం 8 సర్పంచ్, 15 ఉప సర్పంచ్, 120 వార్డు సభ్యుల స్థానాలు, ఒక ఎంపీటీసీ స్థానం ఖాళీగా ఉన్నాయని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ కమిషనర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన మీదట వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు ఉన్నందున ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకుని ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అయి ఉండాలని అధికారులకు కమిషనర్ సూచించారు.
కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పెర్కిట్ కు చెందిన నారాయణరెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వ్యవసాయ కళాశాలలో చదువుతున్న సమయంలో సహచర విద్యార్థిగా ఉన్న పొద్దుటూరి నారాయణరెడ్డి మాతృమూర్తి పొద్దుటూరి కాంతమ్మ ఇటీవలే స్వర్గస్థులయ్యారు. ఈ నేపథ్యంలో మాతృవియోగానికి లోనైన నారాయణరెడ్డిని కమిషనర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు ఆర్ అండ్ బి అతిథి గృహంలో కమిషనర్ పార్థసారథిని ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page