Home జనరల్ మూడవ రోజు 48 గంటల నిరాహారదీక్షను విరమించిన జిల్లాఅధ్యక్షులు Er మోహన్ గారు…
జనరల్

మూడవ రోజు 48 గంటల నిరాహారదీక్షను విరమించిన జిల్లాఅధ్యక్షులు Er మోహన్ గారు…

(తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్రంలోని 36 లక్షల మంది నిరుద్యోగుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి గ్రూప్ 1 మరియు ఇతర పరీక్షలను రద్దు చేయించేలా పోరాటం చేపట్టిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి పోరాటానికి మద్ధతుగా బుధవారం ప్రారంభం అయిన దీక్ష ఈ రోజు ఉదయం 11 గంటలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అక్కడే జిల్లా అధ్యక్షులు Er మోహన్ గారికి పార్టీ శ్రేణులు నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు దీక్ష మాత్రమే విరమిస్తున్నం, కానీ TSPSC లీకేజీల మీద పోరాటాన్ని కాదని అన్నారు. TSPSC బోర్డ్ రద్దు చేసి, నూతన కమిటీ నియమించి ,కేసును సీబీఐ కి అప్పగించి నిరుద్యోగులకు న్యాయం చెసే వరకు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతు పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి లింగంపల్లి యాదగిరి గారు,జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ గారు, జిల్లా కోశాధికారి రోమాల బాబు గారు, సిద్దిపేట జిల్లా కార్యదర్శులు మంద పాండు, బాకురి అశోక్, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్గారు,,అనాజిపూర్ సంజీవ్ గార్లు,జిల్లా EC మెంబెర్ చిట్యాల శ్రీను గారు,దుబ్బాక అసెంబ్లీ అధ్యక్షులు జింక సంజీవులు గారు,గజ్వేల్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం గారు,గజ్వేల్ టౌన్ అధ్యక్షులు కోట మహేందర్ గారు, కుకునూర్ పల్లి మండల అధ్యక్షులు ఆశని కనక ప్రసాద్ గారు,వివిధ అసెంబ్లీ కమిటీ నాయకులు, మండల,సెక్టార్ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

డీఎస్సీ లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించిన మంద మహిపాల్..

తెలంగాణ వార్త ,నందిపేట్: ఆదివారం నందిపేట్ మండల కేంద్రంలో మొన్నటి డీఎస్సీ లో ఉత్తీర్ణత సాధించి...

జనరల్

రామచంద్ర పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఉద్యోగి మృతి…

తెలంగాణ వార్త ,నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు...

జనరల్

చేపూర్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన వాల్మీకి జయంతి..

ఆర్మూర్‌లోని క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ...

జనరల్

బాసర త్రిబుల్ ఐటీ ఇంచార్జ్ వీసిగా డాక్టర్ అలిసిరి గోవర్ధన్…

జేఎన్టీయూ, తెలంగాణ వార్త:: బాసర త్రిబుల్ ఐటి వి. సి గా డాక్టర్ అలిసిరి గోవర్ధన్...

You cannot copy content of this page