Home జనరల్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా…
జనరల్

ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా…

తెలంగాణ వార్త:: ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లలో చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తూనే ఉంది. తాజాగా ఆదివారం ఉదయమే శేరిలింగంపల్లి, బాలానగర్ మండలాల పరిధిలో విస్తరించి ఉన్న సున్నం చెరువులో కూల్చివేతలు చేపట్టారు. శేరిలింగంపల్లి, బాలానగర్ మండలాల పరిధిలో సున్నం చెరువు 26 ఎకరాలలో విస్తరించి ఉంది. అయితే ఈ చెరువు చాలాకాలంగా కబ్జాలకు గురవుతుంది. 2013లో సర్వే నిర్వహించిన ఇరిగేషన్ అధికారులు ఈ చెరువులో 15.23 ఎకరాల్లో నీళ్లు ఉన్నాయని నిర్ధారించారు. 2013లో హెచ్‌ఎండీఏ 4805 ఐడీ నంబర్‌ ఇచ్చింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే సర్వే నంబర్‌ 13, సర్వే నంబర్‌ 14, సర్వే నంబర్‌ 16 ఉన్నట్లుగా నిర్ధారించింది. ఆ సర్వే నంబర్లలోనే బఫర్‌ జోన్లు ఉన్నాయి. సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ను నిర్ధారిస్తూ 2014 మే 14న ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్ధారించిన ఎఫ్‌టీఎల్‌కు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. కొందరు కబ్జారాయుళ్లు దానిని ముందుకు జరపగా.. ఇంకొందరు ఫెన్సింగే లేకుండా చేశారు.

సర్వే నంబర్‌ 13, 14ల్లో చెరువు భూమి లేకుండా చేయగా, ప్రస్తుతం సర్వే నంబర్‌ 16పై కబ్జారాయుళ్ల కన్నుపడింది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ లేకుండా చేయడానికి గత బీఆర్ ఎస్ పార్టీ నేతల సూచనల మేరకు ఇలా రోడ్డు నిర్మించారన్న ఆరోపణలూ ఉన్నాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాలానగర్‌ మండలం అల్లాపూర్‌ రెవెన్యూ పరిధిలోకి వచ్చే ఈ చెరువు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని గుంట్లబేగంపేట రెవెన్యూ పరిధిలోనూ కొంత ఉంటుంది. రెండు జిల్లాల యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కబ్జాకు గురయింది. ఈ చెరువు ఆక్రమణలపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ గత ఏడాది రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్తున్న గురుడు కాపు సంఘం ఫార్మర్ యూత్ భక్తులు..

తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని గురుడు కాపు సంఘం భక్తులు భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జరానికి గణనాథుని...

జనరల్

హయత్ నగర్ సర్కిల్ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగురవేసిన హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్…

తెలంగాణ వార్త::తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్, డాక్టర్...

జనరల్

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తెలంగాణ తల్లిని,...

జనరల్

రికార్డింగ్ డ్యాన్సులు, హైడ్రోజల్ బల్బ్స్ తో గణేష్ నిమజ్జనం చేస్తే కఠిన చర్యలు అడిషనల్ డి.సి.పి బసవా రెడ్డి హెచ్చరిక…

ఆర్మూర్, తెలంగాణ: వార్త: ఆర్మూర్ డివిజన్లో గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా ఆర్మూర్ అడిషనల్ డిసిపి బసవ...

You cannot copy content of this page