Home జనరల్ సీజ్ చేసిన వాహనాల ను ఈనెల 29న వేలం వేయనన్నట్టు తెలిపిన వెహికల్ ఇన్స్పెక్టర్ గుర్రం వివేకానంద రెడ్డి…
జనరల్

సీజ్ చేసిన వాహనాల ను ఈనెల 29న వేలం వేయనన్నట్టు తెలిపిన వెహికల్ ఇన్స్పెక్టర్ గుర్రం వివేకానంద రెడ్డి…

తెలంగాణ వార్త, ఆర్మూర్::: గత కొన్ని సంవత్సరాలుగా రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి వివిధ చోట్ల ఉంచిన వాహనాలకు నోటీసులు పంపినా వాటి ఓనర్లు మరియు ఎవరూ కూడా సంప్రదించనందున అట్టి వాహనాలకు పై అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 29న వేలం వేయనున్నట్టు ఆర్మూర్ మోటార్ వాహన తనిఖీ అధికారి గుర్రం వివేకానంద రెడ్డి తెలిపారు. ఇందులో ఆటోలు, రోడ్డు రోలర్, మినీ గూడ్స్ వాహనాలు, గూడ్సు వాహనాలు, బొలెరోలు, స్కూలు బస్సులు, మోటార్ సైకిల్ తదితర వాహనాలు ఆర్మూర్ బస్ స్టాండ్ లో మరియు
నందిపేట్, మోర్తాడ్ ,ముప్కాల్,బాల్కొండ పోలీస్ స్టేషన్లు మరియు వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాల కు ఈనెల 29న “యాస్ ఇస్ వేర్ ఇస్” ఎక్కడ ఉన్నవి అక్కడ పద్ధతిలో వేలం నిర్వహించ నున్నట్టు తెలిపారు. ఆసక్తి కలవారు ధరావతు చెల్లించి ఈ వేలం పాటలో పాల్గొనవలసిందిగా సూచించారు. వేలంపాట ఆర్మూర్ వాహన తనిఖీ అధికారి కార్యాలయం ఎం జె కాలనీ యూనిట్ ఆఫీస్ లో మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రయాణికులు ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఎస్ హెచ్ ఓ..

తెలంగాణ వార్త. ధోండి మోహన్. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మరియు సిబ్బంది...

జనరల్

అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

హైదరాబాద్ తెలంగాణ బ్యూరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్...

జనరల్

నాయకులు చేస్తే సంసారం? అధికారులు చేస్తే వ్యభిచారమా!ఆర్మూర్ రూటు సపరేటు!ఇది ఎక్కడి న్యాయం..

*తెలంగాణ వార్త* హైదరాబాద్ (సిటీ బ్యూరో) దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్...

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

You cannot copy content of this page