Home జనరల్ పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు..
జనరల్

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు..

తెలంగాణ వార్త:::సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కాస్త ఉపశమనం లభించింది. పోసాని కృష్ణ మురళికి బెయిల్ లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసాని కృష్ణ మురళికి కడప మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అలాగే పోసాని కృష్ణ మురళిని కస్డడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటీషన్‌ను కడప మొబైల్ కోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు విభేదాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారంటూ జనసేన నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదు మేరకు.. ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోసాని కృష్ణ మురళిని ఫిబ్రవరి నెలాఖర్లో ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరచగా.. కోర్డు 14 రోజుల రిమాండ్ విధించింది.
అయితే పోసాని కృష్ణ మురళిపై ఏపీవ్యాప్తంగా 17 వరకూ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో పోసాని కృష్ణ మురళికి వివిధ ప్రాంతాల పోలీసులు పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిపై పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు తొలుత పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని.. నరసరావుపేట కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు సబ్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఆదోని త్రీటౌన్ పోలీసులు గుంటూరు జైలులో రిమాండ్‌గా ఉన్న పోసానిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కర్నూలు కోర్టుకు తరలించగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు పోసానిని కర్నూలు జిల్లా కారాగారానికి తరలించారు. ఈ నెల 18 వరకు పోసాని అక్కడ రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

You cannot copy content of this page