Home జనరల్ అసెంబ్లీ కమిటీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పై బైఠాయించిన బహుజన పార్టీ నాయకులు..
జనరల్

అసెంబ్లీ కమిటీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పై బైఠాయించిన బహుజన పార్టీ నాయకులు..

గౌరవెల్లి (తెలంగాణ వార్త )గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు అండగా పోరాటం చేయడానికి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కమిటీ నాయకులు హుస్నాబాద్ అసెంబ్లీ కమిటీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పై బైఠాయించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ER మోహన్ గారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కల్వకుంట్ల కుటుంబానికో న్యాయం, తెలంగాణ ప్రజలకో న్యాయం జరుగుతుంది అన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భునిర్వాసితులను ఇప్పటివరకు పూర్తి స్థాయి పరిహారం అందలేదు. అదేవిధంగా గౌరవేల్లి భూ నిర్వాసితులకు కూడా పరిహారం ఇవ్వకుండా ఈ నెల 20 వ తారికున కేటీఆర్ పర్యటన ఉండడం తో భూనిర్వాసితులు చేస్తున్న దీక్షను అన్యాయంగా,బలవంతంగా అణిచివేస్తున్నారు. అక్కడికి కనీసం మీడియాను కూడా అనుమతి ఇవ్వడం లేదు అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కాం లో ఢిల్లీ వెళ్తే ఆమెకు అండగా కేటీఆర్, హరీష్ రావు, BRS నాయకులు అండగా వెళ్లారు. కానీ గౌరవేల్లి భునిర్వాసితులను కలవడానికి వెళ్తే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు అని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. గౌరవేల్లి భునిర్వాసితులకు సరైన న్యాయం చేయకుండా కేటీఆర్ పర్యటన చేస్తే కచ్చితంగా అడ్డుకుంటామని ,వారికి న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జులు డేగల వెంకటేష్, లింగంపల్లి యాదగిరి ,జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్, కోశాధికారి రోమాల బాబు, హుస్నాబాద్ అసెంబ్లీ ఇంచార్జి ఎనగందుల శంకర్, అసెంబ్లీ అధ్యక్షులు రాజు, గజ్వేల్ అసెంబ్లీ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్,మండల నాయకులు, సెక్టార్ నాయకులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన జోనల్ కమిషనర్ ఎస్. పంకజ..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ...

జనరల్

మహిళలకు బస్సులు ఫ్రీ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..

హైదరాబాద్:( తెలంగాణ వార్త) కర్ణాటక ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం ఈరోజు గురువారం నుండి కర్ణాటక బస్సులు...

జనరల్

అఫిలియేటెడ్‌ కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ సంబంధించి1600 విద్యార్థులు ఫెయిల్..

(తెలంగాణ వార్త) రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల పనితీరు అంతంతమాత్రంగా ఉంది. భారీ భవంతులు, హంగులు...

జనరల్

వరంగల్ జైలు స్థలం 1 వేయి కోట్ల కు తాకట్టు పెట్టిన కేసీఆర్..

(తెలంగాణ వార్త )వరంగల్ జిల్లాలో గల జైలు స్థలం కూలగొట్టి అక్కడ హాస్పిటల్ కడతానని చెప్పిన...

You cannot copy content of this page