Home జనరల్ అసెంబ్లీ కమిటీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పై బైఠాయించిన బహుజన పార్టీ నాయకులు..
జనరల్

అసెంబ్లీ కమిటీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పై బైఠాయించిన బహుజన పార్టీ నాయకులు..

గౌరవెల్లి (తెలంగాణ వార్త )గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు అండగా పోరాటం చేయడానికి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కమిటీ నాయకులు హుస్నాబాద్ అసెంబ్లీ కమిటీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు పై బైఠాయించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ER మోహన్ గారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కల్వకుంట్ల కుటుంబానికో న్యాయం, తెలంగాణ ప్రజలకో న్యాయం జరుగుతుంది అన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భునిర్వాసితులను ఇప్పటివరకు పూర్తి స్థాయి పరిహారం అందలేదు. అదేవిధంగా గౌరవేల్లి భూ నిర్వాసితులకు కూడా పరిహారం ఇవ్వకుండా ఈ నెల 20 వ తారికున కేటీఆర్ పర్యటన ఉండడం తో భూనిర్వాసితులు చేస్తున్న దీక్షను అన్యాయంగా,బలవంతంగా అణిచివేస్తున్నారు. అక్కడికి కనీసం మీడియాను కూడా అనుమతి ఇవ్వడం లేదు అంటే అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ స్కాం లో ఢిల్లీ వెళ్తే ఆమెకు అండగా కేటీఆర్, హరీష్ రావు, BRS నాయకులు అండగా వెళ్లారు. కానీ గౌరవేల్లి భునిర్వాసితులను కలవడానికి వెళ్తే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు అని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. గౌరవేల్లి భునిర్వాసితులకు సరైన న్యాయం చేయకుండా కేటీఆర్ పర్యటన చేస్తే కచ్చితంగా అడ్డుకుంటామని ,వారికి న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జులు డేగల వెంకటేష్, లింగంపల్లి యాదగిరి ,జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్, కోశాధికారి రోమాల బాబు, హుస్నాబాద్ అసెంబ్లీ ఇంచార్జి ఎనగందుల శంకర్, అసెంబ్లీ అధ్యక్షులు రాజు, గజ్వేల్ అసెంబ్లీ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్,మండల నాయకులు, సెక్టార్ నాయకులు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page