Home జనరల్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మంత్రి ఓకే..
జనరల్

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మంత్రి ఓకే..

హైదరాబాద్, జూన్ 17:( తెలంగాణ వార్త ) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి మంత్రి కేటీఆర్ పూర్తి సానుకూలంగా స్పందించారు. శుక్రవారం ప్రగతిభవన్ లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ తో కలిసి ఈ విషయమై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.

హైదరాబాద్ నగరంలోని జర్నలిస్టుల సంఖ్య ఎంత..? అర్హులైన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు..? అందరికీ ఇళ్లు కేటాయించడానికి ఎంత స్థలం అవసరం అవుతుంది అనే విషయాలను చర్చ లో భాగంగా ఆరా తీశారు. దీంతోపాటు జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కి సంబంధించిన స్థలాలను సభ్యులకు అప్పగించే విషయంపై కూడా చర్చ జరగగా మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు కూడా ఇళ్లు ఇచ్చే విధంగా వారం పది రోజుల్లో పూర్తిస్థాయి స్పష్టతను ఇచ్చే దిశగా చర్చలు జరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న దాదాపు నాలుగు వేల మంది జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కార దిగగా ముందడుగు పడ్డట్లు అయిందన్నారు TUWJ ప్రధాన కార్యదర్శి, ఆస్కాని మారుతి సాగర్ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

డీఎస్సీ లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించిన మంద మహిపాల్..

తెలంగాణ వార్త ,నందిపేట్: ఆదివారం నందిపేట్ మండల కేంద్రంలో మొన్నటి డీఎస్సీ లో ఉత్తీర్ణత సాధించి...

జనరల్

రామచంద్ర పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఉద్యోగి మృతి…

తెలంగాణ వార్త ,నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు...

జనరల్

చేపూర్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన వాల్మీకి జయంతి..

ఆర్మూర్‌లోని క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ...

జనరల్

బాసర త్రిబుల్ ఐటీ ఇంచార్జ్ వీసిగా డాక్టర్ అలిసిరి గోవర్ధన్…

జేఎన్టీయూ, తెలంగాణ వార్త:: బాసర త్రిబుల్ ఐటి వి. సి గా డాక్టర్ అలిసిరి గోవర్ధన్...

You cannot copy content of this page