Home జనరల్ కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి.. రామారావు పటేల్…..
జనరల్

కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోండి.. రామారావు పటేల్…..

*ఈరోజు శాసనసభ్యుడు రామారావు పటేల్*

*అక్టోబర్ ఐదు నుంచి ప్రభుత్వం ద్వారా సోయా కొనుగోళ్లు*

*ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ *

బైంసా, తెలంగాణ వార్త:: రైతాంగానికి మద్దతు ధర రావాలన్న ఉద్దేశంతో మార్క్ ఫెడ్ ద్వారా అక్టోబర్ 5 నుంచి సోయా కొనుగోళ్లను చేపడతామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం తన నివాసంలో మార్క్ ఫెడ్ డిఎం ప్రవీణ్ రెడ్డితో సమావేశమై కొనుగోళ్ల విషయమై చర్చించారు. రైతులకు మార్కెట్లో తక్కువ ధర ఉన్నందున, ఇబ్బందులు కలగకుండా అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిస్తా మన్నారు. మొదట భైంసా, కుభీర్ లలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రభుత్వం ద్వారా క్వింటాలుకు 4892 రూపాయల ధర లభిస్తుందన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రైవేట్ మార్కెట్లో పంటను తక్కువ ధరకు అమ్మి రైతులు నష్టపోవద్దన్నారు. సమావేశంలో కుబీర్ పి. ఎ.సి ఎస్.చైర్మన్, రాష్ట్ర బోర్డు డైరెక్టర్ గంగా చరణ్ తో పాటు పలువురు ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

సోమవారం సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాత్రి జాగారం ఉన్నందున ప్రభుత్వం సోమవారం ప్రభుత్వ ఆప్షనల్ సెలవు...

జనరల్

తెలంగాణ వార్తఎగ్జిట్ పోల్ ఫలితాలు రెడి!!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు నేపథ్యంలో తెలంగాణ వార్త తన బృందాన్ని ఆర్మూర్...

జనరల్

ముగిసిన ఎన్నికలు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు...

You cannot copy content of this page