తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని ప్రకటించడమైనది. రేపు అనగా 16/03/ 2025,ఆదివారం రోజున నూతన కమిటీ యొక్క ప్రమాణస్వీకారం హైదరాబాదులోని ఉప్పల్లో గల క్షత్రియ భవన్ నందు ఈ యొక్క కార్యమము నిర్వహించబడును.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ ఉపాధ్యక్షులు విశ్వనాథ్ బాలకిషన్ గారు వచ్చేస్తారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా SSK రాష్ట్ర అధ్యక్షులైన విశ్రాంత ఐపీఎస్, ఐజిపి డాక్టర్ విశ్వనాధ్ రవీందర్ గారు వ్యవహరిస్తారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టంకు విష్ణు,ఉపాధ్యక్షులు అల్జాపూర్ శ్రీనివాస్, నాగూరాం నామాజీ, కార్య నిర్వాహణ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం సంబంధించి రాబోయే పట్కరి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక సమస్యల పైన, భవిష్యత్తులో సాధించే అభివృద్ధి గురించి చర్చ జరుగుతుంది.
ఈ ఒక్క ప్రమాణ స్వీకారానికి ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మామిడిపల్లి నుంచి రాష్ట్ర మేనేజింగ్ కమిటీ మెంబర్లుగా నియామకమైన మామిడిపల్లి సమాజ్ అధ్యక్షులు ఖాందేష్ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి అల్జాపూర్ దాదా నందకిషోర్, జెస్సు అనిల్ కుమార్, అల్జాపూర్ రాజేష్ లు పాల్గొంటారు.
ఈ పాత్రికేయ సమావేశంలో రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు జెస్సు అనిల్ కుమార్, అల్జాపూర్ రాజేష్ మామిడిపల్లి యువజన సమాజ్ అధ్యక్షులు బచ్చే వాల్ వేణు, దోండి కుబీర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment