Home జనరల్ శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..
జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు

పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు

అనుచరులతో కలిసి ఎమ్మెల్సీ కవితను కలిసిన రవీందర్ యాదవ్

జన్మదినం సందర్భంగా పూరీ తీరాన సైకత శిల్పం ఏర్పాటు

సైకత శిల్పం ఫోటో ఫ్రేమ్ అందజేసిన రవీందర్ యాదవ్

శేరిలింగంపల్లిలో పార్టీని ముందుండి నడిపించాలని సూచన

స్థానిక కార్యకర్తలకు అండగా ఉంటాం..

కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తాం -రవీందర్ యాదవ్

తెలంగాణ వార్త::భారాస ఎమ్మెల్సీ కవితను సీనియర్ నేత రవీందర్ యాదవ్ తన అనుచరులతో కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కవిత జన్మదినం సందర్భంగా ఒడిశా రాష్ట్రం పూరీ తీరాన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించిన రవీందర్ యాదవ్.. కళాకారులతో కలిసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కళాకారులకు, సైకత శిల్పం రూపుదిద్దిన వారికి నూతన వస్త్రాలను అందించారు. ఎమ్మెల్సీ కవిత జన్మదినంను స్వయంగా రవీందర్ యాదవ్ పూరీ తీరాన ఘనంగా నిర్వహించారు. వేడుకలకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత అడిగి తెలుసుకున్నారు. పూరీ జగన్నాథ్ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రసాదాన్ని కవితకు రవీందర్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తుండటంపై ప్రశంసలు కురిపించారు. ప్రజా సేవలో ముందుంటున్నారని రవీందర్ యాదవ్ ను కొనియాడారు. శేరిలింగంపల్లిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో భారాస అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణను నాశనం చేస్తుందని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రవీందర్ యాదవ్ వెల్లడించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page