Home జనరల్ పేర్కిట్ ఆశా ఆశుపత్రి లో ఏం జరుగుతుంది..
జనరల్

పేర్కిట్ ఆశా ఆశుపత్రి లో ఏం జరుగుతుంది..

మొన్నటికి మొన్న మానవత్వం చాటిన ఆశ హాస్పిటల్ కు ఈ మచ్చలేంటి.?

– ఆశ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు అసలు కారణాలు ఏమిటి.?

★ 1.80 వేల రూపాయలు తీసుకొని సరైన వైద్యం చేయలేదని కుటుంబ సభ్యుల ఆందోళన

★ 15 రోజుల క్రితం వైద్యం కోసం ఆస్పత్రిలో చేరిన భూక్య మేనిబాయ్

★ బాధితుల తరఫున ఆస్పత్రికి మాట్లాడడానికి వచ్చిన ఒక రాజకీయ పార్టీ నాయకులపై దురుసుగా ప్రవర్తించిన ఆసుపత్రి సిబ్బంది

ఆర్మూర్( తెలంగాణ వార్త) ఏప్రిల్14 : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రైమ్ ఆశ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో గత 15 రోజుల క్రితం ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామానికి చెందిన భూక్య మేనిబాయ్ కాలుకు శస్త్ర చికిత్స చేసి రాడ్డు వేసిన వైద్యులు వారం రోజుల తర్వాత లక్ష 80 వేల రూపాయల బిల్లు వేసి ఇంటికి డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రెండు రోజుల తర్వాత కాలు వాపు రావడంతో తిరిగి ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. మళ్లీ డ్రెస్సింగ్ చేస్తామని లోనికి తీసుకువెళ్లి రోగికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి రెండవసారి కుటుంబ సభ్యులకి చెప్పకుండా ఆపరేషన్ చేశారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. తీరా ఇప్పుడు వేసిన రాడ్డు సెప్టిక్ అయిందని, రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పారని తామేమి ఇప్పుడు చేయలేమని ఇంటికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుపేదలైన తమ వద్ద డబ్బులు లాక్కొని సరైన వైద్యం అందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో బాధితులు తరఫున ఆసుపత్రి వైద్యులతో మాట్లాడడానికి ఆసుపత్రికి వచ్చిన ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులపై ఆసుపత్రి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దుర్భాషలాడుతూ రోగి బంధువులను వారి తరఫున వచ్చిన వారిని బయటకు వెళ్లిపోవాలని మీడియా సభ్యుల ముందు దుర్భాషలాడుతూ దూషించిన వైనం. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి వెంటనే చర్య తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

‘తుడుం దెబ్బ’ ఆదివాసి హక్కుల గురించి చర్చ!

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆదివాసి హక్కుల గురించి, ఆదివాసులకు రావలసిన నిధులు...

జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12...

జనరల్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 140 అక్రమ ఇంటి నంబర్ల రద్దు! కమిషనర్ రాజు..

తెలంగాణ వార్త::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అసైన్ మెంట్, ఓపెన్ ప్లాట్లకు అక్రమంగా కేటాయించిన 140 ఇంటి...

జనరల్

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ మరియు నిల్వ, విక్రయ కేంద్రాలపై దాడులు..

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ...

You cannot copy content of this page