Home జనరల్ స్వామి భాయ్ బ్లడ్ ఫౌండేషన్ ద్వారా పలువురికి రక్తదానం…
జనరల్

స్వామి భాయ్ బ్లడ్ ఫౌండేషన్ ద్వారా పలువురికి రక్తదానం…

(తెలంగాణ వార్త) ఆర్మూర్ మార్చి 10: ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహించే మ్యాదరి స్వామి తన ఫౌండేషన్ ద్వారా ఆపదలో రక్తం అవసరం ఉన్నవారికి రక్తం డొనేట్ చేయించి, ప్రాణదాతగా మారి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ కి రక్తం కొరకు ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి రక్తదాతల ద్వారా రక్తం సేకరించి కేశ్ పల్లి గ్రామానికి చెందిన కే బుజ్జీ కు ఓ నెగెటివ్ రక్తం, ఆర్మూర్ కు చెందిన శైలజ కు ఓ పాజిటివ్ రక్తం, పాలెం గ్రామానికి చెందిన లతిక కు ఏ పాజిటివ్ రక్తం, ఆర్మూర్ కు చెందిన పూజితకు బి పాజిటివ్ రక్తం, ముక్కాల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అరుణ్ కు ఓ పాజిటివ్ రక్తందాతల ద్వారా సమకూర్చారు. ఈ సందర్భంగా రక్తం దాతలైన ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కే ఆత్మ చరణ్, మామిడిపల్లి గ్రామానికి చెందిన మేడిదల క్రాంతి గౌడ్, గోవింద్ పెట్ గ్రామానికి చెందిన పల్లికొండ రాజేష్, ఆర్మూర్ పట్టణానికి చెందిన పి రాఘవేంద్ర, ఆర్మూర్ కు చెందిన కే గణేష్ లకు స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ తరపున మాధరి స్వామి ధన్యవాదాలు తెలిపారు.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జనాభా కులగనన పూర్తిచేసిన కాంగ్రెస్..

    తెలంగాణ వార్త: సెక్రటేరియట్: మోహన్ సాయి సీనియర్ జర్నలిస్ట్::    రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్...

జనరల్

వాహనాన్ని లాక్కొని హక్కు పోలీసులకు లేదు. రాష్ట్ర హైకోర్టు..

తెలంగాణ వార్త:  హైదరాబాద్ సిటీ బ్యూరో. (దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్..) డ్రంక్ అండ్ డ్రైవ్...

You cannot copy content of this page