Home జనరల్ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…
జనరల్

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్

తెలంగాణ తల్లిని, ప్రజలను కాంగ్రెస్ పార్టీ అవమానించింది

ప్రజా పాలన అంటే ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడమా..?

రేవంత్ రెడ్డిది నియంత పాలన.. కేసీఆర్ అభివృద్ధి చేస్తే దాన్ని నాశనం చేస్తుండు

సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఆగ్రహం

కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా..

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్

తెలంగాణ వార్త, హైదరాబాద్ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాల్సిన చోట కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ఆలస్యం చేసి విద్యార్థుల బలిదానాలను తీసుకున్న కాంగ్రెస్ పార్టీని చరిత్ర మరవదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ప్రజలకు కష్టాలు మొదలయ్యాయన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటుపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాబీ షేకాలు చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం తెలంగాణ భవన్ లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను నెంబర్ గా అభివృద్ధి చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దివాళ తీయించేలా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ తల్లి విగ్రహాం ఏర్పాటు చేయకుండా రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ విగ్రహాం ఏర్పాటు మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద లేదని ధ్వజమెత్తారు. ఢిల్లీకి గులాంలు చేస్తూ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారన్నారు. ప్రజా పాలన అంటే ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోవడమేనని కాంగ్రెస్ పార్టీ కొత్త అర్ధాన్ని చెబుతుందని విమర్శలు గుప్పించారు.

ఈ కార్యక్రమం లో బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు రవీందర్ యాదవ్ తో పాటు శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ మారబోయిన రవి యాదవ్ నర్సింహా రెడ్డి సాయి చందర్ శ్రీకాంత్ యాదవ్ మల్లేష్ గౌడ్ శ్రీశెలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్తున్న గురుడు కాపు సంఘం ఫార్మర్ యూత్ భక్తులు..

తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని గురుడు కాపు సంఘం భక్తులు భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జరానికి గణనాథుని...

జనరల్

హయత్ నగర్ సర్కిల్ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగురవేసిన హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్…

తెలంగాణ వార్త::తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్, డాక్టర్...

జనరల్

రికార్డింగ్ డ్యాన్సులు, హైడ్రోజల్ బల్బ్స్ తో గణేష్ నిమజ్జనం చేస్తే కఠిన చర్యలు అడిషనల్ డి.సి.పి బసవా రెడ్డి హెచ్చరిక…

ఆర్మూర్, తెలంగాణ: వార్త: ఆర్మూర్ డివిజన్లో గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా ఆర్మూర్ అడిషనల్ డిసిపి బసవ...

జనరల్

దేవాంగ సంఘం అధ్యక్షుడిగా కొంగిరాము ఎన్నిక…

పోరా హోరీగా జరిగిన ఎన్నికలు. తెలంగాణ వార్త:: ఆదివారం జరిగిన దేవంగా సంఘం ఎన్నికల్లో పోటా...

You cannot copy content of this page