రంగారెడ్డి, తెలంగాణ వార్త: తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ సివిల్ జడ్జ్ మరియు కార్యదర్శి రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీమతి ఏ శ్రీదేవి గారు, ఈరోజు అనగా 21-09-2022 న హయత్ నగర్ లో ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ను ఆకస్మితంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న పరిసరాలను, భోజనశాలను తరగతి గదులను, మరియు వసతి గృహాలను పరిశీలించారు, అక్కడున్న విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. భోజనం శాలలో ఉన్న సర్కులను, నిత్యవసరాల వస్తువులను మరియు అప్పుడే వండిన భోజనంను పరిశీలించడం జరిగినది. మెరుగైన భోజనము విద్యార్థులకు ఇవ్వవలసిందిగా ప్రిన్సిపాల్ కు సూచనలు చేయడం జరిగినది అదేవిధంగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది దాన్ని త్వరగా సత్వరమే మంచినీళ్లు అందేటట్టు చూడాలని గిరిజన జూనియర్ కళాశాల, హయత్ నగర్ ప్రిన్సిపాల్ కి సూచించడం జరిగింది. ఇంకోసారి త్వరలో మరి ఒకసారి త్వరలోనే ఈ కాలేజ్ ని సందర్శిస్తానని సీనియర్ సివిల్ జడ్జ్ మరియు సెక్రటరీ రంగారెడ్డి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ శ్రీమతి ఏ శ్రీదేవి గారు తెలియజేశారు.
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/IMG-20220921-WA0073-1024x766.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/IMG-20220921-WA0072-1024x766.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/IMG-20220921-WA0070-1-1024x766.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/IMG-20220921-WA0073-1-1024x766.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/IMG-20220921-WA0071-1024x766.jpg)
Leave a comment