Home హాట్ న్యూస్ 3కోట్లతో పరారైన (కి)లేడీ
హాట్ న్యూస్

3కోట్లతో పరారైన (కి)లేడీ

పొదుపు పేరుతో అధిక వడ్డీ ఇస్తానని చెప్పడంతో వందలాది మంది ఆకర్షితులై వాయిదాల పద్ధతిన సొమ్ము చెల్లించారు. కాగా, మూడు రోజులుగా ఆమె అందుబాటు-లో లేకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. చుట్టు-పక్కల వాకబు చేసి తాము మోసపోయామని గ్రహించి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల లెక్క ప్రకారం రమ్య సుమారు 3 కోట్ల మేరకు వసూళ్లు చేసి పరారైనట్లు- తెలుస్తోంది.

రమ్య తన భర్త నుంచి దూరంగా ఉంటూ తల్లి అరుణ వద్ద చిట్లు- వీధిలో నివాసముంటోంది. అలాగే ప్రస్తుతం పైవీధి వలంటీ-ర్‌ గా పని చేస్తోంది. అయితే.. ఆమె కొన్నేళ్లుగా పట్టణ ప్రధాన వీధుల్లో వ్యాపారాలు చేస్తున్న వారితోపాటు- ప్రజల నుండి పొదుపు పేరుతో వాయిదాల పద్ధతిన సొమ్ము వసూలు చేసేది. నెలకు 500, 1000 చొప్పున వసూళ్లు చేసి ఏడాది చివర్లో నిత్యావసర సరుకులను, డబ్బులను ఇచ్చేది. ఇదే పద్ధతిని కొన్నేళ్లుగా చేస్తోంది. కాగా, ఇటీ-వల సదరు వసూళ్ల విధానాన్ని మార్చి అధిక వడ్డీని, లాభాన్ని ఆశ చూపడంతో పలువురు లక్షల్లో పొదుపు చేశారు. అటు-వంటి వారిలో సారిక చిన నరసింహులు, సంజీవిని, అరకు పావని, నాగేంద్ర తదితరులు లక్షల్లో కట్టి మోసపోయినట్లు- పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ ఎస్‌ఐ పక్రుద్దీన్‌ విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. బాధితుల సంఖ్య గంట గంటకూ పెరుగుతోందని, వందల్లో ఉన్నట్లు-గా తెలుస్తోందన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page