Home జనరల్ శ్రీ భాషిత పాఠశాల లో స్వయం పాలక దినోత్సవం..
జనరల్

శ్రీ భాషిత పాఠశాల లో స్వయం పాలక దినోత్సవం..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా స్వయంపాలక దినోత్సవం (సెల్ఫ్ గవర్నింగ్ డే) గురువారం రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు.

దీనిలో భాగంగా 10వ తరగతికి చెందిన విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి వారు తరగతులు నిర్వహించారు.అంతేకాకుండా ఉపాధ్యాయులు రోజు విద్యార్థులు కోసం ఎంత తపన పడుతుందో మాకు అర్థమైందని విద్యార్థులు వివరించారు.
మధ్యాహ్నం సమయంలో అలీ టవర్స్ పెర్కిట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పోలపల్లి సుందర్ గారు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల డైరెక్టర్ పోలపల్లి సుమాలిని గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని వారిలో జరిగిన అభివృద్ధి గురించి ఒక్కొక్కరుగా మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని చెప్పారు అంతేకాకుండా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది అవకాశం లాగా వచ్చిన కాని దాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పారు.శ్రీ భాషిత పాఠశాల లో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా నా కుటుంబ సభ్యులతో సమానంగా స్వీకరిస్తాను. నా పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు అందరికీ నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని కొనియాడారు. అనంతరం ప్రతి ఒక్క ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులందరూ ఆటపాటలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, కరస్పాండెంట్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ ప్రిన్సిపల్, కోర్ కమిటీ మెంబర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

గణేష్ నిమజ్జనానికి తరలి వెళ్తున్న గురుడు కాపు సంఘం భక్తులు..

తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని గురుడుగాపు సంఘం భక్తులు భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జరానికి గణనాథుని నిమజ్జనానికి...

జనరల్

హయత్ నగర్ సర్కిల్ కార్యాలయం నందు జాతీయ జెండా ఎగురవేసిన హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్…

తెలంగాణ వార్త::తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం హయత్ నగర్ డిప్యూటీ కమిషనర్, డాక్టర్...

జనరల్

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్…

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తెలంగాణ తల్లిని,...

జనరల్

రికార్డింగ్ డ్యాన్సులు, హైడ్రోజల్ బల్బ్స్ తో గణేష్ నిమజ్జనం చేస్తే కఠిన చర్యలు అడిషనల్ డి.సి.పి బసవా రెడ్డి హెచ్చరిక…

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ డివిజన్లో గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా ఆర్మూర్ అడిషనల్ డిసిపి బసవ...

You cannot copy content of this page