Home జనరల్ ఈ రైళ్లు ఇక ఇక్కడ ఆగవు.
జనరల్

ఈ రైళ్లు ఇక ఇక్కడ ఆగవు.

తెలంగాణ వార్త:::సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో రోజు రోజుకూ రద్దీ ఎక్కువ అవుతోంది. ప్రయాణికులు కనీసం కూర్చొవడానికి కూడా చోటు లేకుండా పోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగానే.. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పూర్తి చేశారు. ఇక్కడ నుంచే కొన్ని రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే చాలా వరకు ట్రైన్స్ ప్రారంభం కాగా.. త్వరలో మరికొన్ని పట్టాలెక్కనున్నాయి. ఈ రకంగా.. రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి దానాపూర్, ముజఫర్‌పూర్, కాకినాడ, నర్సాపూర్‌లకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ, అధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని వీటిని తాత్కాలికంగా అందుబాటులోకి తెస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల అధికారి శ్రీధర్ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

You cannot copy content of this page