క్షత్రియ సమాజ్ పెద్దలు.
హైదరాబాద్, జూలై8:- తెలంగాణ వార్త బ్యూరో
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో దేవాంగ సంఘం ఆత్మ గౌరవ భవన్ నిర్మాణానికి 30 కోట్ల రూపాయల విలువైన
33 గుంటల
స్థలాన్ని కేటాయించినందుకు పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన శుక్రవారం మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మంత్రి తో మాట్లాడుతూ ఆగష్టు 14 వ తేదిన ఉప్పల్ భగాయత్ లో జరిగే క్షత్రియ సమాజ్ ఆత్మ గౌరవ భవన్ భూమి పూజకు మఖ్య అతిధిగా రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ,మంత్రి కేటిఆర్ లకు తాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు క్షత్రియ సమాజ్ రాష్ట్ర కమీటీ సభ్యులు పాల్గొన్నారు.
Leave a comment