Home హాట్ న్యూస్ రాష్ట్ర ప్రజలకు వాహన మిత్ర పథకం అమలు..
హాట్ న్యూస్

రాష్ట్ర ప్రజలకు వాహన మిత్ర పథకం అమలు..

హైదరాబాద్, తెలంగాణ వార్త:: ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈనెల 15న విశాఖ జిల్లాలో ఇరవై వేల మంది లబ్దిదారులు వాహన మిత్ర పథకంలో లబ్ధి పొందుతున్నారని రాష్ట్ర పరిశ్రమలూ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెళ్లడించారు.రాష్ట్రంలో 2.61 లక్షల మందికి రూ.261 కోట్ల రూపాయలను వాహన మిత్ర పథకంగా పంపిణీ చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ- ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంలో 15వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్‌ సోమవారం పరిశీలించారు. సభ ఏర్పాట్లు- వివరాలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. మల్లికార్జునను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే మూడు విడతలుగా వాహన మిత్ర లబ్ధిదారులకు సుమారు 750 కోట్ల రూపాయలు అందజేశామని చెప్పారు.

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు చూసి ప్రతిపక్షాల నవ రంద్రాలు మూసుకుపోయాయని అని మంత్రి అమర్నాథ్‌ ఎద్దేవా చేశారు. ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన ప్లీనరీకి ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని యెవ్వరు ఊహించ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు టీ-డీపీని ఆక్రమించుకున్న తర్వాత 27 సంవత్సరాలలో ఇంత పెద్ద సభ ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన ప్లీనరీ కి హాజరైన జనంతో 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయిందని అయినా సభకు స్పందన లేదని టిడిపి నాయకులు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి అమర్‌ నాథ్‌ వెంట మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్‌ ఎల్‌ సి వరుదు కళ్యాణి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ శీతంరాజు సుధాకర్‌, వి ఎమ్‌ ఆర్‌ డీ యే చైర్‌ పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల తదితరులు ఉన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page