Home జనరల్ <em>దేశ అభ్యున్నతి యువకుల చేతిలోనే… యువతలో చైతన్యం రావాలి.. బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు</em>
జనరల్

దేశ అభ్యున్నతి యువకుల చేతిలోనే… యువతలో చైతన్యం రావాలి.. బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

శుక్రవారం రోజు లింగంపల్లి డివిజన్ సురభి కాలనీ నుండి శ్రీకాంత్ ఆధ్వర్యంలో వెంకట్ భాను ,సాయిరాం ల మిత్ర బృందం మరియు కాలనీ వాసులు గతంలో బిక్షపతి యాదవ్ గారు చేసినటువంటి అభివృద్ధి, రవికుమార్ యాదవ్ గారి నాయకత్వానికి , నేడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని , కేసిఆర్ దుర్మార్గపు పాలనను అంతమొందించే సమయం ఆసన్నమైందని , ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా , మాయమాటలు చెప్తూ పబ్బం గడుపుతున్నారని, ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరని , రాబోయే ఎన్నికల్లో మీకు రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చోబెడతారని అన్నారు, సురభి కాలనీకి గతంలో మానాన్న గారు బిక్షపతి యాదవ్ గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ 8 సంవత్సరాలలో ఈ టీఆర్ఎస్ నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు, మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన , ఏ సమస్య వచ్చిన మీకు నేను, భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని వారికి హామీ ఇచ్చి భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగంపల్లి డివిజన్ కంట్స్తెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఏల్లేష్ , సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ , ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

‘తుడుం దెబ్బ’ ఆదివాసి హక్కుల గురించి చర్చ!

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆదివాసి హక్కుల గురించి, ఆదివాసులకు రావలసిన నిధులు...

జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12...

జనరల్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 140 అక్రమ ఇంటి నంబర్ల రద్దు! కమిషనర్ రాజు..

తెలంగాణ వార్త::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అసైన్ మెంట్, ఓపెన్ ప్లాట్లకు అక్రమంగా కేటాయించిన 140 ఇంటి...

జనరల్

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ మరియు నిల్వ, విక్రయ కేంద్రాలపై దాడులు..

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ...

You cannot copy content of this page