దివ్య ఖురాన్ ప్రపంచ మానవాళికి రుజుమార్గం చూపే గ్రంధం
ఖమ్మం జిల్లా తుమ్మలగడ్డ మున్నర పెట్ ప్రాంతంలో గ్రానైట్ మార్బుల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ కే ఖాసిం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు . పవిత్ర రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఉండే ఉపవాసాలను నియమాలతో ఉంది అల్లాహ్ ను ఆరాధిస్తూ పుణ్యఫలాలు పొందుతారన్నారు . దివ్య ఖురాన్ ప్రపంచ మానవాళికి రుజుమార్గం చూపే గ్రంధం అని కనుక ఖురాన్ ను పటించి దానిని ఆచరించడం తద్వారానే సాఫల్యం కలుగుతుందని అన్నారు . ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు కర్నాటక కృష్ణ , షేక్ మక్బూల్ , షౌకత్ అలీ , మాజీ గ్రంథాలయ చైర్మన్ ఎండీ ఖమర్ , టీఎన్జీవో అధ్యక్షులు అఫ్జల్ హసన్ , తాళ్ళూరి మధు , గ్రానైట్ ప్రసిడెంట్ తమ్మినేని వెంకటరావు , వెంకటరమణ , బాబురావు మరియు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు .
Leave a comment