Home జనరల్ మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ తెలిపారు.
జనరల్

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ తెలిపారు.

 

    హైదరాబాద్ (తెలంగాణ వార్త) సోమవారం జిల్లాలో జరిగిన మహబూబ్ నగర్ – రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 86.9 శాతం పోలింగ్ నమోదయిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు హరీష్ తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయిన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 గంటల వరకు 15.2  శాతం పోలింగ్ నమోదయిందని, 12 గంటల వరకు 43.8 శాతం పోలింగ్ నమోదయిందని, మధ్యాహ్నం 2 గంటలు 65.5 శాతం పోలింగ్ నమోదయిందని, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తయి 86.9 శాతం నమోదయిందని కలెక్టర్ తెలిపారు.  
     ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సరూర్ నగర్ లోని విక్టోరియా మోమోరియల్ హై స్కూల్, హయత్ నగర్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్, రాజేందర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరీష్. 

జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఏలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టరు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 16న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

You cannot copy content of this page