Home జనరల్ మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ తెలిపారు.
జనరల్

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ తెలిపారు.

 

    హైదరాబాద్ (తెలంగాణ వార్త) సోమవారం జిల్లాలో జరిగిన మహబూబ్ నగర్ – రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 86.9 శాతం పోలింగ్ నమోదయిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు హరీష్ తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయిన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 గంటల వరకు 15.2  శాతం పోలింగ్ నమోదయిందని, 12 గంటల వరకు 43.8 శాతం పోలింగ్ నమోదయిందని, మధ్యాహ్నం 2 గంటలు 65.5 శాతం పోలింగ్ నమోదయిందని, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తయి 86.9 శాతం నమోదయిందని కలెక్టర్ తెలిపారు.  
     ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సరూర్ నగర్ లోని విక్టోరియా మోమోరియల్ హై స్కూల్, హయత్ నగర్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్, రాజేందర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరీష్. 

జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఏలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టరు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 16న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page