Home జనరల్ మహిళా దినోత్సవం వేళ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..
జనరల్

మహిళా దినోత్సవం వేళ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త..

తెలంగాణ వార్త::తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త అందించింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డిఏ) పెంపును ప్రకటించారు. ఈ పెంపుతో ప్రతినెల ఆర్టీసీపై అదనంగా రూ.3.6 కోట్లు భారం పడనుండగా.. ఉద్యోగులంతా ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 150 కోట్ల మంది ఉచితంగా ప్రయాణించారని.. దీని కారణంగా ఉద్యోగులపై అదనపు భారం పడి ఒత్తిడికి గురయినా.. వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి ఉద్యోగులను అభినందించారు.
ఇక.. మహిళా సాధికారతను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. కోటి మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి మిషన్ – 2025 కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ కింద.. గ్రామాల్లో సెర్ప్, పట్టణాల్లో మెప్మా పరిధిలో ఉన్న మహిళా సంఘాలను ఐక్యపరిచే నిర్ణయం తీసుకున్నారు. ఇకపై.. ఈ మహిళా సంఘాలన్నీ ఒకే వ్యవస్థ కింద పనిచేస్తూ.. అభివృద్ధికి మరింత దోహదపడతాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page