తెలంగాణ వార్త:: హైదరాబాద్ లో కాల్ సెంటర్ స్కాం వెలుగు చూసింది. అమెరికాకు చెందిన పేపాల్ కస్టమర్స్ డేటా చోరీ చేసి స్కాం చేసినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. విదేశాల్లో ఉంటున్న కస్టమర్స్ ను టార్గెట్ చేసుకొని స్కాం చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం కాల్ సెంటర్ పై రైడ్ చేసి గురువారం వరకు 63 మందిని అరెస్ట్ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా సైబర్ నేరగాళ్లు కాల్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు.

Leave a comment