Home జనరల్ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి కి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాం…
జనరల్

వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి కి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాం…


డా.ప్రీతి మరణానికి కారకులు ఎంతటి వారైనా కటకటాల వెనక్కి పంపేవరకు పోరాడుతం
★వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రితినాయక్ హత్యకు కారకులైన అందరికి కటినశిక్ష విధించాలి.
★ డాక్టర్ ప్రీతి కి న్యాయం జరిగే వరకు ఉద్యమిస్తాం.
★వైద్య విద్యార్థిని మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీరు, KMC యాజమాన్యం తీరు, వైద్యుల వైఖరి సిగ్గుచేటు.
★రాష్ట్ర గవర్నర్ గారు చొరవతీస్కొని రాష్ట్ర మహిళ కమిషన్, మానవహక్కుల కమిషన్ మరియు పోలీసులు, సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి.
★ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర వైద్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖల వారు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
-బట్టు శ్రీధర్ (భారతీయ విద్యార్థి మోర్చా – రాష్ట్ర అద్యక్షులు).

నిజామాబాద్ (తెలంగాణ వార్త) మంగళవారం నిజామాబాద్ జిల్లా కె ద్రంలో భారతీయ విద్యార్థి మోర్చా(BVM) మరియు సావిత్రి మాత సైన్యం(SMS) జిల్లా కమిటీలు ఏర్పాటు చేసిన కొవ్వొత్తుల ప్రదర్శనలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ బట్టు గారు మరియు SMS రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి గారు , జిల్లా అధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ.. KMC వైద్య విద్యార్తిని డా. ప్రీతి గారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించడం జరిగింది… డా. ప్రీతికి న్యాయం జరిగే వరకు మీకు అండగా నిలబడుతామని .. వారి తరుపున పోరాడుతామన్నారు.. ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ కళాశాలల్లో ర్యాగింగ్ పేరుమీద విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.. పేద మధ్యతరగతి కుటుంబలనుంది వస్తున్న విద్యార్థులను ర్యాగింగ్ పేరుపై చదువుకు దూరం చేస్తూ.. అవహేళన చేస్తున్న… అటు ప్రభుత్వం మరియు కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోకపోవడం అలాగే మహిళ కమిషన్, పోలీసు వ్యవస్థ వీటి మీద కనీసం దృష్టిపెట్టట్లేదు అని ఆరోపించారు… ప్రీతి లాంటి బిడ్డలు అనేకమంది రాష్ట్ర వ్యాప్తంగా సతమతమౌతున్నారని అన్నారు… ఒక పక్క విద్యార్థులు తోటి విద్యార్థులను ర్యాగింగ్ పెరు మీద ఇబ్బంది పెడుతుండగా… మరోపక్క విద్య బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు కూడా అమ్మాయిలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు అనేక ఆరోపణలు వస్తున్నాయి… బయటకి చెప్తే మీ జీవితాలు నాశనమైతై అని కొందరు ఉపాధ్యాయులు బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారాలు ఉన్నాయి… తక్షణమే విద్యార్థుల సంక్షేమార్థం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము. కొంతమంది దగుల్బాజీ నాకొడుకులు రాజకీయం చేస్తూ.. ఇంతటి అవమానాన్ని అన్యాయాన్ని తప్పుదారి పట్టించే కుట్ర చేస్తున్నారు.. వారికి తొత్తుగా బోగస్ ఛానళ్లు ఇష్టమచ్చినట్టు వార్తల్లో రాయడాన్ని భారతీయ విద్యార్థి మోర్చా గా తీవ్రంగా ఖండిస్తున్నాము. డా.ప్రీతికి వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం అని అన్నారు. ప్రభుత్వం వీరికి న్యాయం చేయలేని పక్షాన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బీవీఎం జిల్లా నాయకులు బబ్లూ, నితీష్, రాకేష్, మెట్టు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page