Home జనరల్ నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం<br>• ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానం
జనరల్

నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం
• ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానం

నిజామాబాద్/నందిపేట్. తెలంగాణ వార్త::

జిల్లా నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటి పొలిసింగ్ లో భాగంగా ఆదివారం స్థానిక మదర్శ లో ఏర్పాటు చేసిన నందిపేట్ ముస్లిం కమిటీ సమవేశం లో నేర రహిత సమాజము కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నందిపేట్ ఎస్ ఐ 2 ఎం డి ఆరిఫుద్దీన్ పేర్కొన్నారు
నందిపేట్ గ్రామంలో గల నాలుగు మజీద్ ల వద్ద మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు చాలా కీలకంగా పనిచేస్తాయని ఏస్ ఐ అన్నారు.

సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని ఆయాన తెలిపారు. ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవచ్చని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టడం జరిగింది అని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అన్ని గ్రామాలలో సిసి కెమెరాల ఏర్పాటు చేసే విధంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మండలం లో కృషి చేస్తున్నామని చెప్పారు.సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, మరియు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపినారు. నేరాలను అదుపు చేయడం, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించి పట్టుకోవడంలో సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు.
అదేవిధంగా గంజాయి ,డ్రాక్స్ జూదము లాంటి చెడు వ్యాసనాలకు యువతను దూరంగా ఉంచే విధంగా మజీద్ అధ్యక్షులు తమ తమ మజీద్ ఇమామ్ ల ద్వారా యువతకు ప్రబోధనాలు చేయాలని కోరారు

ఈ కార్యక్రమంలో నందిపేట్ ముస్లిం కమిటీ అధ్యక్షుడు అహ్మద్ ఖాన్ మండల అధ్యక్షుడు ఖలీల్ మహమ్మద్ ముస్లిం కమిటీ సభ్యులు మజీద్ కమిటీ అధ్యక్షులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page