Home జనరల్ దివ్యాంగుల ప్రత్యేక శిబిరన్ని సద్వినియోగం చేసుకోండి…
జనరల్

దివ్యాంగుల ప్రత్యేక శిబిరన్ని సద్వినియోగం చేసుకోండి…

నందిపేట్, తెలంగాణ వార్త::

తెలంగాణ సమగ్ర శిక్ష, హైదరాబాద్ మరియు ALIMCO ( Artificial Limbs Manufacturing Corporation of India) ఆధ్వర్యంలో నవంబర్ 15 న మోడ్రన్ పబ్లిక్ పాఠశాల,ఖలీల్వాడి,నిజామాబాద్ నందు దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ శిభిరంలో వైద్యులు దివ్యాంగులను పరీక్షించి,వారికి అవసరమైన ఉపకరణాలు గుర్తిస్తారని నందిపేట్ మండల విద్యాశాఖాధికారి పత్రిక ప్రకటన తెలిపారు .

శిభిరానికి హాజరయ్యే దివ్యాంగులు తీసుకుని రావాల్సిన ధ్రువపత్రాలు

1) ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ
2) ఆదాయ ధ్రువీకరణ పత్రం /రేషన్ కార్డు జిరాక్స్ కాపీ
3) సదరం సర్టిఫికెట్ ( వైకల్యం 40% కన్నా ఎక్కువగా ఉండాలి.)
4) సదరం సర్టిఫికెట్ లేని వారు ప్రభుత్వ వైద్యుని దగ్గర సర్టిఫికెట్ పొంది, దానిపైన మండల విద్యాధికారి/ప్రధానోపాధ్యాయుల ద్వారా ధ్రువీకరించి తీసుకురావాలి.
5) రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు (వైకల్యం ఫొటోలో కనిపించే విధంగా ఉండాలి).
6) 0-18 సం. వయసు గల దివ్యాంగులు అర్హులు.

*ఈ శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు భోజనం ఏర్పాటు చేయబడును.మండలంలోని దివ్యంగులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి శ్రీ పి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ క్యాంపుకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు మండల ఐ ఈ ఆర్ పి లు నగేష్ గౌడ్, ఫోన్ నెం. 9441516433, మరియు సంతోష్ కుమార్, 8688309140యందు సంప్రదించగలరని ఆయన చెప్పారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

‘తుడుం దెబ్బ’ ఆదివాసి హక్కుల గురించి చర్చ!

తెలంగాణ వార్త:: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఆదివాసి హక్కుల గురించి, ఆదివాసులకు రావలసిన నిధులు...

జనరల్

26 నుంచి పంటలు వేసుకున్న ప్రతి వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12...

జనరల్

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 140 అక్రమ ఇంటి నంబర్ల రద్దు! కమిషనర్ రాజు..

తెలంగాణ వార్త::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అసైన్ మెంట్, ఓపెన్ ప్లాట్లకు అక్రమంగా కేటాయించిన 140 ఇంటి...

జనరల్

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ మరియు నిల్వ, విక్రయ కేంద్రాలపై దాడులు..

రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు, పాల తయారీ...

You cannot copy content of this page