Home జనరల్ రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో విద్య హై స్కూల్ లో అవ్వకు బువ్వ…..
జనరల్

రక్ష స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో విద్య హై స్కూల్ లో అవ్వకు బువ్వ…..

ఆర్మూర్, తెలంగాణ వార్త :శనివారం రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్ వారి ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణములోని జిరాయత్ నగరులో గల విద్యా హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన “అవ్వకు బువ్వ” కార్యక్రమములో ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా దాదాపు 56 మంది పేదవృద్దులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ లు మాట్లాడుతూ అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా పేద వృద్దులకు తమవంతు సహకారం అందిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు. త్వరలో సంస్థ తరపున ఉచిత ఐ క్యాంపు కార్యక్రమము నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందమ్ నరహరి, కోశాధికారి గొనె శ్రీధర్, కార్యనిర్వహక కార్యదర్శులు dr బేతు గంగాధర్, ఖాందేష్ సత్యం, తులసి పట్వారి, మీరా శ్రావణ్, బండారి నరేశ్, సభ్యులు శరత్, సామంత్, ఖోడే శ్రీనివాస్, రాజు, వినోద్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు …..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యేలు వీరే.

1 సిర్పూర్ Sirpur కోనేరు కోనప్ప2 చెన్నూరు Chennur బాల్క సుమన్‌3 బెల్లంపల్లి Bellampalli చిన్నయ్య...

జనరల్

అందరం కలిసికట్టుగా బిజెపిని గెలిపించుకుందాం బిజెపి నాయకుడు మోహన్ రావు పటేల్…

తెలంగాణ వార్త:: ఆదివారం నుండి వారం రోజుల పాటు నిర్వహించేఅసెంబ్లీ ప్రవాస్ యోజన  లో భాగంగా...

జనరల్

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీకి జగ్గారెడ్డి జంప్..

తెలంగాణ వార్త :: కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టిఆర్ఎస్ తీర్థం...

జనరల్

మాధ్యమిక స్కూల్లో విష ఆహారం తిని విద్యార్థుల అస్వస్థత..

తెలంగాణ వార్త ::ముధోల్ నియోజకవర్గం :- బిద్రెల్లీ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన...

You cannot copy content of this page