Home హాట్ న్యూస్ ఢిల్లీ పై దండయాత్ర పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి
హాట్ న్యూస్

ఢిల్లీ పై దండయాత్ర పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి


-రైతులను పెద్ద ఎత్తున కదిలిస్తాం
-వడ్లు కొనే వరకు వదిలేది లేదు
-అన్నం పెట్టే రైతులకు సున్నం పెడుతున్న బీజేపీ
-పంజాబ్ కో నీతి.. తెలంగాణకు మరో నీతా
-నూకలు తినమన్న పీయూష్ కు చుక్కలు చూపిస్తాం
-బీజేపీ నేతలు వడ్లు కొనమని కేంద్రం పై వత్తిడి తేవాలి
-బీజేపీ ట్రిబుల్-ఆర్,కాంగ్రెస్ డబుల్-ఆర్ లను తరిమి కొడతాం
-ఎల్-3ఎంపీ అరగుండు బెండు తీస్తాం
ఆర్మూర్ టౌన్ మాక్లూర్ టౌన్ , నందిపెట్ టౌన్ లో రైతు ధర్నా లో పాల్గొన్న జీవన్ రెడ్డి
-పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్4:- తెలంగాణ వార్త
తెలంగాణ రాష్ట్రంలో వడ్లను కొనాలన్న డిమాండ్ తో రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఢిల్లీపై దండయాత్ర కు రైతులను పెద్ద ఎత్తున కదిలిస్తాం. వడ్లు కొనే వరకు వదిలేది లేదు
అన్నం పెట్టే రైతులకు సున్నం పెడుతున్న బీజేపీ తగిన మూల్యం చెల్లించక తప్పదు.పంజాబ్ కో నీతి.. తెలంగాణకు మరో నీతా?నూకలు తినమని అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ కు చుక్కలు చూపిస్తాం
బీజేపీ నేతలు వడ్లు కొనమని కేంద్రం పై వత్తిడి తేవాలి. వట్టి చేతులతో వస్తే హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టు తరిమి కొడతం.బీజేపీ ట్రిబుల్-ఆర్,కాంగ్రెస్ డబుల్-ఆర్ లను, తొండి సంజయ్, టూరిస్ట్ మంత్రి కిషన్ రెడ్డి లను తిరగనిచ్చే ప్రసక్తే లేదు. ఎల్-3ఎంపీ అరగుండు అరవింద్ బెండు తీస్తాం’ అని
పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణములోని ‘అంబేడ్కర్ చౌరస్తా’ లో సోమవారం జరిగిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ ,జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి
పాల్గొన్నారు.
ఈ కార్యక్రమములో మార్క్ఫెడ్ చైర్మన్ మర గంగారెడ్డి ,జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్, ఆర్మూర్ మండల సర్పంచులు, పీఏ సీ ఎస్ చైర్మన్ లు, ఎంపీటీసీ లు, ఎంపిపి,జెడ్పీటీసీ మరియు రైతులు (హనుమాన్ మాలాధరణలో) పాల్గొన్నారు. టీఆర్ ఎస్ సీనియర్ నాయకులు,ఎమ్ జె హాస్పిటల్ అధినేత డాక్టర్ మధు శేఖర్
ఆర్మూర్ బార్ అసోసియేషన్ లాయర్లు
సత్య సాయి సేవ సంఘం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ
వడ్లు కొనాలని రోడ్లు ఎక్కిన రైతుల ఆవేదన బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు పట్టడం లేదని మండిపడ్డారు.తెలంగాణ రైతుల మేలు కోరే వాళ్ళు అయితే పార్లమెంట్‌లో మా ఎంపీలతో కలిసి ఆందోళన చేయాలి.
రైతుల పక్షాన నిల్వకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు.
రైతులపై కూడా రాజకీయాలు చేస్తే తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లకు భంగపాటు తప్పదని హెచ్చరించారు. పరువు పోతుందన్నారు. రైతులతో పెట్టుకున్నోడు, కేసీఆర్ తో గోక్కున్నోడెవడూ బాగుపడలేదన్నారు.ఎర్ర జొన్న రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన కాంగ్రెస్ ఏమైందో తెలుసన్నారు. రైతుల కడుపులో బుల్లెట్లు దింపిన టీడీపీ ప్రభుత్వం కూలిపోయి ఆ పార్టీ ఆఫీసు కు టూ-లెట్ బోర్డు తగిలించారన్నారు. రైతులతో పెట్టుకున్న ప్రధాని మోడీకి పంజాబ్ లో గుండు సున్నా మిగిలిందన్నారు. రైతేడ్చిన రాజ్యం,ఎద్దేడ్చిన వ్యవసాయం బాగు పడదన్నారు. 2కోట్ల50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటున్నారని, దేశాన్ని సాకుతున్న నాలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణపై వివక్ష చూపుతున్నారని ఆయన కేంద్రంపై మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ 23లక్షల కోట్లను ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వం దోచుకున్నదని ఆయన ఆరోపించారు.13 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన బ్యాంకు రుణాల ఎగవేత దారులను, వైట్ కాలర్ నేరస్తుల ను, కోట్లాది రూపాయల కుంభకోణాలకు పాల్పడిన అవినీతి పరులను దేశం దాటించిన నీచమైన చరిత్ర మోడీ ప్రభుత్వానిదని ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పదేపదే పెంచి లక్షల కోట్లు దోచుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కు 13వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఏం రోగం వచ్చిందని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ అంటే రైతులు,రైతులంటే తెలంగాణ అన్నారు. సీఎం కేసీఆర్ ది ప్రజా ప్రభుత్వ మన్నారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.10,000ల చొప్పున ఇప్పటికే 50వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. రైతు ప్రమాద వశాత్తు చనిపోతే రూ.5,00,000ల చొప్పున చెల్లించే బీమా అమలు చేస్తున్నాం. ఇరవై నాలుగంటల ఉచిత కరెంటు ఇస్తున్నాం.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలకు నీళ్లిచ్చే దిశగా పోతున్నాం. కేవలం రైతు సంక్షేమం కోసమే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మాది” అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page