Home హాట్ న్యూస్ హెడ్ కానిస్టేబుల్ హత్య!
హాట్ న్యూస్

హెడ్ కానిస్టేబుల్ హత్య!

భూతగాదాల వల్ల ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన నిజామాబాద్ నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది.  ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. కొక్కొండ రాంప్రసాద్(60) సం. రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. గత కొన్ని సంవత్సరాల క్రితం ఖానాపూర్ లో ఒక ఇల్లు కట్టుకొని అందులో తన కుటుంబ సమేతంగా జీవిస్తున్నాడు. అయితే అతని ఇంటి ముందు బని శెట్టి గంగ మల్లు అనే వ్యక్తి యొక్క ఇల్లు ఉంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య రోడ్డు విషయంలో లో గొడవ జరిగింది. గొడవలు మనసులో పెట్టుకొని  తేదీ 25.2.2022 న అందాజ సాయంత్రం ఐదున్నర గంటలకు గంగ మల్లు కర్రతో రాంప్రసాద్  తలపై కొట్టి చంపేశాడు.ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ పోలీసులు ఉన్నతాధికారులు అయిన నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్, నిజామాబాద్ రూరల్ సౌత్ సర్కిల్ సిఐ జగడం నరేష్, నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ లింబాద్రి ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చరీకి తరలించి, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వీరి మధ్య గత కొన్ని రోజుల నుంచి భూ తగాదాలు ఏర్పడ్డాయని, ఈ క్రమంలో గంగమల్లు, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ రాంప్రసాద్ పై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page