Home జనరల్ పాత నేరస్తులపై నిఘా పెంచాలి..జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు *పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ, బెస్ట్ స్టేషన్ అని కితాబు.
జనరల్

పాత నేరస్తులపై నిఘా పెంచాలి..జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు *పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ, బెస్ట్ స్టేషన్ అని కితాబు.

నిజామాబాద్/ నందిపేట్ తెలంగాణ వార్త:

పాత నేరస్తులపై నిఘా పెంచాలని జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు ఆదేశించారు, వార్షిక తనిఖీలలో భాగంగా గురువారం పోలీస్ కమిసనర్ కె.ఆర్. నాగరాజు నందిపేట్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డ్ ల పరిశలన చేసిన సందర్బంగా పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి పలు ఆదేశాలు చేశారు.
పాత నేరస్తుల పై ప్రత్యేకదృష్టి పెట్టలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో బాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు కొరకు ప్రజలకు అవగాహన కల్పించి మస్జీద్ , మందిరాల వద్ద సి సి కెమెరాలు ఏర్పాటు కొరకు కృషి చేయాలని తెలిపారు.

ముందుగా పోలీస్ స్టేషన్ యందు మొక్కను నాటి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను , సిబ్బంది ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల సుందరికరణ, చెట్ల పెంపకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి ఎస్సై సల్ల శ్రీకాంత్ ను సిపి అభినందించారు. ఇది వరకు ప్రజాజ్యోతి పత్రికలో వచ్చిన “నందనవనం నందిపేట్ థానా” ఆర్టికల్ ను చదివానాని గుర్తు చేశారు. కోర్ట్ డ్యూటీ రికార్డులు , హెచ్.ఆర్.ఎమ్.ఎస్ విధానము అమలులో చక్కగా విధులు నిర్వహించిన సిబంధిని సైతం అభినందించారు . ఈ కార్యాక్రమంలో ఆర్మూర్ డివిజన్ ఎ.సి.పి శ్రీ ఆర్. ప్రభాకర్ రావు, ఆర్మూర్ రూరల్ సి ఐ బి. గోవర్ధన్ రెడ్డి, నందిపేట్ ఎస్.ఐ ఎస్.శ్రీకాంత్, సిబ్బంది వున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యేలు వీరే.

1 సిర్పూర్ Sirpur కోనేరు కోనప్ప2 చెన్నూరు Chennur బాల్క సుమన్‌3 బెల్లంపల్లి Bellampalli చిన్నయ్య...

జనరల్

అందరం కలిసికట్టుగా బిజెపిని గెలిపించుకుందాం బిజెపి నాయకుడు మోహన్ రావు పటేల్…

తెలంగాణ వార్త:: ఆదివారం నుండి వారం రోజుల పాటు నిర్వహించేఅసెంబ్లీ ప్రవాస్ యోజన  లో భాగంగా...

జనరల్

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీకి జగ్గారెడ్డి జంప్..

తెలంగాణ వార్త :: కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టిఆర్ఎస్ తీర్థం...

జనరల్

మాధ్యమిక స్కూల్లో విష ఆహారం తిని విద్యార్థుల అస్వస్థత..

తెలంగాణ వార్త ::ముధోల్ నియోజకవర్గం :- బిద్రెల్లీ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన...

You cannot copy content of this page