Home హాట్ న్యూస్ నన్ను చంపిన వ్యవసాయ భూములకు మీటర్ లు పెట్ట నీయ: కెసిఆర్
హాట్ న్యూస్

నన్ను చంపిన వ్యవసాయ భూములకు మీటర్ లు పెట్ట నీయ: కెసిఆర్

హైదరాబాద్ (తెలంగాణ వార్త) రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం.. వారి పెట్టుబడి రెట్టింపు చేస్తోందని విమర్శించారు. విద్యుత్ సంస్కరణల పేరుతో రైతుల బోర్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం కోరుతోందని కేసీఆర్ అన్నారు. కేంద్రం ఏం చేసినా తాము ఆ పని చేయబోమని వ్యాఖ్యానించారు. లక్షల కోట్లు దోచుకున్న వాళ్లు ప్రధాని మోదీ హయాంలోనే దేశం విడిచి పారిపోయారని కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని.. కాజీపేట కోచ్ ఫ్యాక్ట‌రీ ఇవ్డం లేదని.. ఒక్క మెడిక‌ల్ కాలేజీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ దేశం నుంచి మోదీని తరిమేసి తమకు ఇచ్చేటోన్ని తీసుకొచ్చుకుంటామని అన్నారు.దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు వ‌రుస‌లో ఉన్నాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు ఇచ్చిన శక్తి, దీవెనలతో తెలంగాణ సాధించుకున్నామని.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ అన్నారు. దేశం కోసం కొట్లాడాల్సి వస్తే కొట్టాడతామని.. ఢిల్లీ కోటను బద్ధలు కొడతామని సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పాత్ర పోషిస్తామని అన్నారు. సిద్ధిపేట ప్రజలు దీవించి పంపితే తెలంగాణ కోసం కొట్టాడి రాష్ట్రాన్ని సాధించానని.. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ దీవించి పంపితే దేశం కోసం కొట్టాడతానని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ బెదిరింపులకు తెలంగాణలో భయపడేవాళ్లు ఎవరూ లేరని అన్నారు. బీజేపీ వాళ్లు అనవసరంగా తమ జోలికి వస్తే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు. దేశంలోని మోదీ ప్రభుత్వం రైతులు, పేదల వెంటపడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page