Home హాట్ న్యూస్ జిల్లా ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
హాట్ న్యూస్

జిల్లా ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

జిల్లా ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి, తెలంగాణ వార్త: ఆగస్టు 11 : సహోదర భావానికి ప్రతీక అయిన రక్షా బంధన్ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం, అక్కా, చెల్లెళ్ళ రక్ష తమ గురుతర బాధ్యత అనే కర్తవ్యాన్ని రక్షాబంధన్ గుర్తు చేస్తుందన్నారు. సోదరభావంతో, ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే ఈ వేడుక భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న ప్రస్తుత శుభ తరుణంలో రక్షాబంధన్ వేడుకలు రావడం శుభ పరిణామం. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న రక్షా బంధన్ వేడుకల్లో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై జాతీయ స్ఫూర్తిని చాటాలని, రాఖీ పౌర్ణమి వేడుక ప్రజల నడుమ సహోదర భావాన్ని మరింతగా పెంపొందించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page