Home జనరల్ <em>బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్</em>
జనరల్

బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్

లక్షలాదిగా తరలివచ్చిన మహారాష్ట్ర ప్రజలు

మహారాష్ట్ర (తెలంగాణ వార్త) రైతులు,యువతలో సరికొత్త జోష్

-గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అఖండస్వాగతం

-కేసీఆర్ గారు వివరించిన తెలంగాణ మోడల్ కు సభలో జేజేలు

-మహారాష్ట్ర లోనూ అమలు చేయాలని నినాదాలు

-బీఆర్ ఎస్ లో పెద్ద ఎత్తున చేరిన మహారాష్ట్ర నేతలు

-అనూహ్యరీతిలో కంధార్-లోహ సభ విజయవంతం కావడం హర్షణీయం

-పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-సభను సక్సెస్ చేసిన మహారాష్ట్ర బీఆర్ ఎస్ నేతలకు, కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు

కంధార్-లోహ(మహారాష్ట్ర):-

మహారాష్ట్రలోని కంధార్-లోహలో ఆదివారం నిర్వహించిన బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కంధార్-లోహ సభకు మహారాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా లక్షల సంఖ్యలో తరలివచ్చి
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అఖండస్వాగతం పలికారని ఆయన తెలిపారు. ప్రధానంగా సభకు హాజరైన రైతులు, యువతలో సరికొత్త జోష్ కనిపించిందన్నారు.
సభా వేదిక పైనుంచి కేసీఆర్ గారు వివరించిన తెలంగాణ మోడల్ కు సభలో మహారాష్ట్ర ప్రజలు జేజేలు పలికారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహారాష్ట్ర లో కూడా అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారని జీవన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం పై ఉన్న అచంచల విశ్వాసంతో మహారాష్ట్రకు చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కేసీఆర్ గారి సమక్షంలో
బీఆర్ ఎస్ లో పెద్ద ఎత్తున చేరినట్టు ఆయన చెప్పారు.
అనూహ్యరీతిలో కంధార్-లోహ సభ విజయవంతం కావడం హర్షణీయమన్నారు.
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లే కలవరపాటుకు గురయ్యేలా బీఆర్ ఎస్ బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసిన మహారాష్ట్ర బీఆర్ ఎస్ నేతలకు, కార్యకర్తలు, ప్రజలకు, తెలంగాణ నుంచి వచ్చిన బీఆర్ ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

డీఎస్సీ లో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానించిన మంద మహిపాల్..

తెలంగాణ వార్త ,నందిపేట్: ఆదివారం నందిపేట్ మండల కేంద్రంలో మొన్నటి డీఎస్సీ లో ఉత్తీర్ణత సాధించి...

జనరల్

రామచంద్ర పల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఉద్యోగి మృతి…

తెలంగాణ వార్త ,నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు...

జనరల్

చేపూర్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన వాల్మీకి జయంతి..

ఆర్మూర్‌లోని క్షత్రియ పాఠశాలలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ...

జనరల్

బాసర త్రిబుల్ ఐటీ ఇంచార్జ్ వీసిగా డాక్టర్ అలిసిరి గోవర్ధన్…

జేఎన్టీయూ, తెలంగాణ వార్త:: బాసర త్రిబుల్ ఐటి వి. సి గా డాక్టర్ అలిసిరి గోవర్ధన్...

You cannot copy content of this page